గల్ఫ్‌‌ బంధు  ప్రకటించాలె

గల్ఫ్‌‌ బంధు  ప్రకటించాలె

 టీపీసీసీ ఎన్‌‌ఆర్‌‌ఐ సెల్‌‌ అధ్యక్షుడు ఎస్‌‌వీరెడ్డి
హైదరాబాద్‌‌, వెలుగు: దళిత బంధు తరహాలో గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ బంధు ప్రకటించాలని టీపీసీసీ ఎన్‌‌ఆర్‌‌ఐ సెల్‌‌ అధ్యక్షుడు ఎస్‌‌వీరెడ్డి డిమాండ్ చేశారు. దుబాయిలోని సోనాపూర్ లేబర్ క్యాంపులో శుక్రవారం ప్రొఫెసర్‌‌ కొత్తపల్లి జయశంకర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌‌వీరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో హుజూరాబాద్ లో సీఎం కేసీఆర్‌‌ దళిత బంధు ప్రకటించినట్టుగానే గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ బంధు ప్రకటించాలని డిమాండ్ చేశారు. గల్ఫ్‌‌ కార్మికుల జీవితాలు బాగు పడాలంటే గల్ఫ్‌‌ బంధు మాత్రమే శరణ్యమని, సీఎం దృష్టి సారించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వరాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.