ప్రతి ప్రభుత్వ పాఠశాలలో స్టూడెంట్ల ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్

ప్రతి ప్రభుత్వ పాఠశాలలో స్టూడెంట్ల ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్

కల్వకుర్తి, వెలుగు: ప్రతి ప్రభుత్వ పాఠశాలలో స్టూడెంట్ల అటెండెన్స్ ను  ఫేషియల్ రికగ్నిషన్​ విధానం ద్వారా అమలు పరచాలని  డీఈఓ గోవిందరాజులు ఆదేశించారు. శుక్రవారం కల్వకుర్తి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టెక్స్ట్ బుక్, వర్క్ బుక్ కు అనుసంధానంగా బోధన ఉండాలన్నారు.  

టీచర్స్​ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకొని విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. తొలిమెట్టు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుపరచాలన్నారు.  ఆబ్సెంట్ విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి రెగ్యులర్ గా వచ్చేటట్టు చూడాలని ఆదేశించారు. ఆయన వెంట అధికారులు కృష్ణారెడ్డి, బాసు నాయక్, ప్రసూన, వెంకటేశ్వర్ తదితరులు ఉన్నారు.