కోపంతో నిలదీశారని.. మనస్తాపంతో ఇంటి నుంచే వెళ్లిపోయారు

కోపంతో నిలదీశారని.. మనస్తాపంతో ఇంటి నుంచే వెళ్లిపోయారు

భర్తపై అలిగి చిన్నారి కొడుకుతో ఓ వివాహిత.. తల్లి తిట్టిందని మరో యువతి గాయబ్

హైదరాబాద్: మాట వరుసకైనా సరే ఏమైనా అంటే భరించలేని తనం జనంలో పెరిగిపోతోంది. తల్లిదండ్రులైనా.. కట్టుకున్న  వాడైనా సరే.. ఒక్క మాటంటే గట్టిగా మాట్లాడితే చాలు.. భరించలేకపోతున్నారు. ఎవరికీ చెప్పకుండా.. సెల్ ఫోన్లు స్విచాఫ్ చేసి గుర్తు తెలియని ప్రాంతాలకు వెళ్లిపోయిన ఉదంతాలు హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్  పరిధి లో జరిగిన ఈ మిస్సింగ్స్ ఉదంతాల మిస్టరీ పోలీసులకు సవాల్ గా మారాయి.

చందానగర్ రెడ్డి కాలనీ లో వీరాంజనేయులు తన  భార్య ఇద్దరు కుమారులలో నివాసం ఉంటున్నాడు. గత నెల తన భార్య నీరజ తన చిన్న కొడుకు కార్తీక్  తో పాటు ఇంట్లో నుండి వెళ్లి ఆచూకి లేకుండా పోయింది. కోపంతో ఆవేశంలో వెళ్లినా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆరోజు నుండి ఇప్పటివరకు వెదుకుతూనే ఉన్నారు. నెల  రోజులుగా వీరి కోసం అన్ని చోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. వీరి మిస్సింగ్ మిస్టరీపై భర్త వీరాంజనేయులు చందానగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేస్తూ.. వెళ్లిపోయిన తన భార్యా కొడుకులు ఎక్కడున్నారోనని ఆందోళన చెందుతున్నారు. వీరి మిస్సింగ్ పై కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు…

తల్లి మందలించిందని ఇంట్లో నుండి వెళ్లి పోయిన యువతి

ఇంటికి ఆలస్యంగా రావడంపై తల్లి మందలించడంతో శోభ (18) అనే యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రా నగర్ లో నివాసం ఉంటున్న నర్సమ్మ రెండో కూతురు శోభ (18) ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయింది. ఎక్కడికెళ్లిందో చెప్పలేదు. ఆచూకీ లేకుండా వెళ్లిపోయి మళ్లీ తిరిగి రాకపోవడంతో శోభ తల్లి నర్సమ్మ చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.