
- ప్రకటించిన ఫిన్టెక్ కంపెనీ వైజ్
హైదరాబాద్, వెలుగు: ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్సేవలు అందించే ఫిన్టెక్ సంస్థ వైజ్ లీడర్షిప్టీమ్ హైదరాబాద్లోని తన ఫుల్స్టాక్హబ్ను మంగళవారం సందర్శించింది. ప్రొడక్టులు, ఇంజినీరింగ్, ఆపరేషన్ల విభాగాల కోసం రాబోయే కొన్నేళ్లలో వందల మందిని తీసుకుంటామని సంస్థ సీనియర్ఎగ్జిక్యూటివ్ఎస్కే సరోగీ చెప్పారు.
ఈ ఏడాది ఏప్రిల్లో 70 మంది ఉద్యోగులతో ప్రారంభమైన ఈ ఆఫీసు గ్లోబల్ఆపరేషన్స్కు సహకరిస్తుందని వైజ్వెల్లడించింది. భారతీయ బిజినెస్లు, ఫ్రీలాన్సర్లకోసం ఒక కొత్త పేమెంట్ ఫీచర్ను కూడా ఈ ఫిన్టెక్ కంపెనీ ప్రారంభించింది. దీంతో వ్యాపార సంస్థలు, 8 ప్రధాన కరెన్సీలలో విదేశాల నుంచి చెల్లింపులను పొందవచ్చు.
వైజ్ తన సేవలను 160కి పైగా దేశాలలో, 40కి పైగా కరెన్సీలలో అందిస్తోంది.