భక్తులతో సందడిగా మారిన మెదక్​ చర్చి

భక్తులతో సందడిగా మారిన మెదక్​ చర్చి

మెదక్​ టౌన్, వెలుగు : మెదక్​ చర్చికి ఆదివారం భక్తులు ఎక్కువగా తరలివచ్చారు. ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు, గీతాలాపనలు చేయగా ప్రెసిబిటరీ ఇన్​చార్జి శాంతయ్య, పాస్టర్లు ​దైవసందేశాన్ని అందించి భక్తులను దీవించారు. 

మెదక్​ జిల్లాతో పాటు హైదరాబాద్​, రంగారెడ్డి, నిజామాబాద్​, కామారెడ్డి జిల్లాలే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక వంటి దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు