మాదాపూర్, వెలుగు : ప్రతి హాస్పిటల్లో ఫైర్ సేఫ్టీ పాటించాలని రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి సూచించారు. అగ్నిప్రమాదాల నివారణపై అందరికీ అవగాహన ఉంటే ప్రమాదం జరిగినప్పుడు ఇతరులను కాపాడొచ్చని పేర్కొన్నారు. ఫైర్ అలారం స్విచ్చాఫ్ చేస్తే నేరం చేసినట్లేనని ఆయన తెలిపారు. ఫైర్ సర్వీస్ వీక్(అగ్ని మాపక దళ వారోత్సవాలు)లో భాగంగా బుధవారం హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్లో ‘ఫైర్ సేఫ్టీ ఇన్ హాస్పిటల్స్’ పై వర్క్షాప్ నిర్వహించారు.
చీఫ్ గెస్టుగా హాజరైన డీజీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. హాస్పిటల్స్లో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఫైర్ సేఫ్టీపై నర్సులు, డాక్టర్లు శిక్షణ తీసుకోవాలన్నారు. హాస్పిటళ్లలో పనిచేసే ప్రతి ఒక్కరికీ ఫైర్ సేఫ్టీపై అవగాహన ఉండాలన్నారు. పేషెంట్లకు ట్రీట్మెంట్ఇవ్వడంతో పాటు అగ్నిప్రమాదం జరిగితే వారిని కాపాడే బాధ్యత కూడా డాక్టర్లు తీసుకోవాలని కోరారు. హాస్పిటల్ బిల్డింగ్కు అనుమతులు ఇచ్చే సమయంలో ఓపెన్ విండోస్ పెట్టాలని తాము చెబుతున్నామన్నారు. ‘ఇటీవల సికింద్రాబాద్ స్వప్న లోక్ కాంప్లెక్స్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది.అక్కడ ఎమర్జెన్సీ మెట్లు ఉన్నా లాక్ చేసి ఉంచారు. ఫైర్ సేఫ్టీ ఎక్విప్ మెంట్, పంపు ఉన్నా పనిచేయలేదు. రెగ్యులర్ మెయింటెనెన్స్ లేదు.
ఫైర్ అలారం ఎన్నిసార్లు మోగినా అన్ని సార్లు చెక్ చేసుకోవాలి తప్ప ఫాల్స్ అలారం వస్తున్నదని ఆఫ్ చేయొద్దు’ అని నాగిరెడ్డి వివరించారు. బిల్డింగ్లలో చాలా ప్రమాదాలు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్లే జరుగుతాయని, ప్రతి పదేండ్లకు ఒకసారి బిల్డింగ్ ఎలక్ట్రికల్ వైరింగ్ మార్చుకుంటే ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. ఫైర్ సేఫ్టీపై అవగాహన ఉన్న వాళ్లు హైదరాబాద్లో చాలా తక్కువ మంది ఉన్నారని, అందుకోసం ఫైర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నెల, మూడు నెలల పాటు ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. ఈ వర్క్షాప్లో అగ్నిమాపక శాఖ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, ఏడీ నారాయణరావు, రీజినల్ఫైర్ ఆఫీసర్ పాపయ్య, యశోద హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.