మంత్రి కేటీఆర్ ​పచ్చి అబద్ధాలు చెప్పారు : ఎంపీ ధర్మపురి అరవింద్​

మంత్రి కేటీఆర్ ​పచ్చి అబద్ధాలు చెప్పారు : ఎంపీ ధర్మపురి అరవింద్​

నిజామాబాద్​లో మంత్రి కేటీఆర్ పూర్తి అవాస్తవాలు మాట్లాడారని ఎంపీ ధర్మపురి అరవింద్​ విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో గృహలక్ష్మీ పథకానికి రూ.12 వేల కోట్లు కేటాయించినట్లు చూపారని.. వాస్తవంగా ఒక్క రూపాయి కేటాయించలేదని ఆరోపించారు. 

ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కేవలం మూడు రోజుల సమయమే ఇచ్చి.. మద్యం టెండర్లకు 15 రోజులకుపైగా టైం కేటాయించడాన్ని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసేందుకే కొత్త కొత్త స్కీంలని కేసీఆర్​ కథలు చెబుతున్నారన్నారు. 

ALSO READ: అసత్య ప్రచారాలు నమ్మొద్దు.. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ : మంత్రి వేముల

పార్లమెంటులో తమ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుండటం వల్లే ఆగస్టు 10న నిజామాబాద్​లో జరిగిన  ప్రోగ్రాంకి వెళ్లలేదని.. దానిని కేటీఆర్​రాజకీయం చేస్తున్నారని ఆక్షేపించారు. 

కేటీఆర్​ నోటికి ఇష్టవచ్చినట్లు మాట్లాడతారని ఆయన తమకు సంస్కారం నేర్పడం ఏంటని ప్రశ్నించారు. పార్లమెంట్​ సాక్షిగా బీఆర్​ఎస్​ నేతలు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.