కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన ధవన్.. హైదరాబాద్ టార్గెట్ 144

కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన ధవన్.. హైదరాబాద్ టార్గెట్ 144

సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. బ్యాటింగ్ లో తేలిపోయి కష్టాల్లో ఉన్న పంజాబ్ ను కెప్టెన్ ధవన్ (99, 66 బంతుల్లో) వెన్నెముకలా నిలబడ్డాడు. ప్రత్యర్థి బౌలింగ్ ను ఎదుర్కొని.. ఒక్కడే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. జట్టుకు డిఫెండబుల్ టోటల్ స్కోర్ ను అందించాడు.

పంజాబ్ బ్యాటర్లలో ధవన్, సామ్ కరన్ (22, 15 బంతుల్లో) మినహా ఏ ఇతర బ్యాట్స్ మెన్ రెండకెల స్కోర్ చేయలేకపోయారు. హైదరాబాద్ బౌలర్లలో మయాంక్ మర్కందే ఆడిన మొదటి మ్యాచ్ లోనే సూపర్ బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సన్, ఉమ్రాన్ మాలిక్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు, భువనేశ్వర్ కుమార్ కు ఒక వికెట్ దక్కింది.