డయాబెటిస్ కంట్రోల్లో ఉండాలంటే చక్కెర తగ్గించడం ఒక్కటే కాదు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం చాలా ముఖ్యం. లేదంటే టైప్–1, టైప్–2 డయాబెటిస్ బారినపడతారు. అంతేకాదు గుండెజబ్బులు, చూపు తగ్గడం, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకని వీళ్లు వారానికి రెండున్నర గంటల సేపు ఎక్సర్సైజ్ చేయాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామాలు చేస్తే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్.
డయాబెటిస్ ఉన్నవాళ్లు... నడవడం, సైకిల్ తొక్కడం, ఈతకొట్టడం వంటి కార్డియో మెటబాలిక్ ఎక్సర్సైజ్లు చేయాలి. వారంలో ఐదురోజులు అరగంట చొప్పున ఈ ఎక్సర్సైజ్ చేస్తే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అంతేకాదు ఫ్యాట్తో పాటు బ్లడ్ ప్రెజర్ కూడా తగ్గుతుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లలో కొందరు ఆఫీస్లో గంటల కొద్దీ కూర్చొని పనిచేస్తుంటారు. అలాంటివాళ్లు మధ్యమధ్యలో ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. కొంచెం దూరం నడవాలి.
చక్కెర ఎంత ఉండాలంటే..
ఎక్సర్సైజ్కి ముందు గ్లూకోజ్ లెవల్స్ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. చక్కెర శాతం140 నుంచి 180 మిల్లీగ్రామ్స్/డెసి లీటర్ మధ్య ఉంటే ఎక్సర్సైజ్ చేయొచ్చు. అలాకాకుండా 90 మి.గ్రా/డి.ఎల్ మాత్రమే ఉంటే 15 నుంచి 30 గ్రాముల చక్కెర తీసుకోవాలి. అందుకోసం యాపిల్ ముక్క లేదా అరటిపండు, రెండు టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష, టేబుల్ స్పూన్ తేనె తినాలి. ఒకవేళ చక్కెర శాతం 70మి.గ్రా/డిఎ.ల్ కంటే తక్కువ ఉంటే దాన్ని ‘హైపోగ్లైసీమియా’ అంటారు. ఇలాంటి పరిస్థితిలో చక్కెర శాతం మరింత తగ్గితే అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకని వీళ్లు ఎక్సర్సైజ్ చేసేముందు బిస్కెట్లు, బాదం పప్పు, వాల్నట్స్ వంటివి తినాలి అంటున్నాడు ఎండోక్రైనాలజిస్ట్, డయాబెటాలజిస్ట్ మహేష్ చవాన్.