సూరత్ లో మళ్లీ ప్రారంభమైన వజ్రాల పరిశ్రమ

సూరత్ లో మళ్లీ ప్రారంభమైన వజ్రాల పరిశ్రమ

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా మూతపడిన సూరత్ వజ్రాల పరిశ్రమ మళ్లీ తెరుచుకుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే… కొద్ది మంది కార్మికులతోనే పనులు ప్రారంభమయ్యాయి. సూరత్ లో పరిశ్రమ ప్రారంభమైనప్పటికీ… ముంబైలో ఇంకా బిజినెస్ ప్రారంభం కాలేదని చెప్పారు వజ్రాల వ్యాపారులు. లాక్ డౌన్ తో ఎగుమతులకు పెద్ద ఆటంకం కలిగిందని, దీంతో నష్టం సంభవించిందన్నారు. తక్కువ మంది సిబ్బందితోనే పనులను ప్రారంభించామని… వారితో ఎక్కువ పని గంటలు చేయించి, అధిక జీతాన్ని చెల్లిస్తామని చెప్పారు వ్యాపారులు.