
దంతాలపల్లి, వెలుగు: గ్రూపు-2 ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. మండల పరిధిలోని పెద్దముప్పారం గ్రామానికి చెందిన దిగోజు బద్రమ్మ సోమయ్య దంపతుల కొడుకు దిగోజు షరీశ్ గ్రూప్–2లో ఉద్యోగం సాధించాడు.
షరీశ్ఇప్పటికే పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించగా, తర్వాత గ్రూప్–4 లో జూనియర్ అసిస్టెంట్ గా సెలెక్ట్ కాగా, ప్రస్తుతం హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో విధులు నిర్వహిస్తున్నాడు. తాజాగా ప్రకటించిన గ్రూపు–2 ఫలితాల్లో ఎక్సైజ్ శాఖ సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాడు. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన షరీశ్ను గ్రామస్తులు అభినందిస్తున్నారు.