‘గేమ్ ఛేంజర్’ పై దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

‘గేమ్ ఛేంజర్’ పై దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో వచ్చిన కిక్ ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాడు రాంచరణ్. ప్రస్తుతం తన వైఫ్ ఉపాసనతో కలిసి దుబాయ్ ట్రిప్ లో జాలీగా గడుపుతున్నాడు. ఈ బ్రేక్ తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లోకి దిగనున్నాడు. అదే ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు నిర్మాతగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చెర్రీ ఈ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి దిల్ రాజు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

‘‘ శంకర్ మొదట నాకు 45 నిమిషాల కథను వినిపించాడు. దీనికి పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని ముందే ఫిక్స్ అయ్యాడు. కానీ, కథ విన్న తర్వాత దీనికి రాం చరణ్ అయితే సరిగ్గా సరిపోతుందని చెప్పా. ఇదే  విషయం చెర్రీకి ఫోన్ చేసి చెప్పాను. ఫోన్లో కథ విన్న తర్వాత అతను కూడా వెంటనే ఓకే అనేశాడు.  దీంతో ఈ ప్రాజెక్ట్ ఇలా పట్టాలెక్కబోతోంది’’ అంటూ వివరించాడు.  పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో కియారా అద్వానీ ఫిమేల్ లీడ్. అంజలి, ఎస్ జే సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కు థమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఫైనల్ చేశారు.