భరత నాట్యం మూవీ నుంచి..డుగు డుగు డయ్యో అనే పాట రిలీజ్

భరత నాట్యం మూవీ నుంచి..డుగు డుగు డయ్యో అనే పాట రిలీజ్

సూర్య తేజ ఏలే హీరోగా ‘దొరసాని’ ఫేమ్ కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భరత నాట్యం’. మీనాక్షి గోస్వామి హీరోయిన్. పాయల్ సరాఫ్ నిర్మిస్తున్నారు. ఇదొక యూనిక్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్. ‘సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటీఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్’ అనేది   క్యాప్షన్.

ఈ మూవీ నుంచి ‘డుగు డుగు డయ్యో’ అనే పాటని దర్శకుడు అనిల్ రావిపూడి లాంచ్ చేశాడు. వివేక్ సాగర్ కంపోజ్ చేసిన ఈ మాస్‌‌ సాంగ్‌‌ను మంగ్లీ ఎనర్జిటిక్‌‌గా పాడింది.  సినిమాని నిజ జీవితంతో పోలుస్తూ కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో స్నేహా గుప్తా చేసిన డ్యాన్స్ మూమెంట్స్ మాస్‌‌ను ఇంప్రెస్ చేసేలా ఉన్నాయి. త్వరలోనే సినిమా రిలీజ్‌‌ డేట్‌‌ను అనౌన్స్ చేస్తామని మేకర్స్ తెలిపారు.