పెద్ది మూవీతో చరణ్‌‌ కు నేషనల్ అవార్డ్ వస్తుంది: శివ రాజ్‌‌కుమార్

పెద్ది మూవీతో చరణ్‌‌ కు నేషనల్ అవార్డ్ వస్తుంది:  శివ  రాజ్‌‌కుమార్

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా రూపొందించిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా  ‘పెద్ది’.  మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మించారు. జూన్ 4న వరల్డ్‌‌వైడ్‌‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా వైడ్‌‌గా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. సోమవారం బెంగళూరులో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్​ మాట్లాడుతూ ‘నా జీవితంలో  చేసిన మోస్ట్ ఇన్‌‌స్పైరింగ్ ఫిల్మ్ ఇది.  

శివన్నతో  కలిసి పనిచేయడం నా జన్మ ధన్యమైందని భావిస్తున్నా’ అని అన్నాడు. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని జాన్వీ కపూర్ చెప్పింది. శివ  రాజ్‌‌కుమార్ మాట్లాడుతూ ‘రామ్ చరణ్‌‌తో  కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపించింది.  ఈ సినిమాతో ఆయనకి  కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని  నమ్ముతున్నా.

ఈ చిత్రంలోని  బలమైన ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది’ అని అన్నారు. ఇదొక అద్భుతమైన స్పోర్ట్స్ డ్రామా అని, అయినా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని నిర్మాత సతీష్​ చెప్పారు.