గుండెపోటుతో దర్శకుడు కన్నుమూత

గుండెపోటుతో దర్శకుడు కన్నుమూత

శాండల్‌వుడ్ దర్శకుడు కిరణ్ గోవి గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం అతనికి 50 ఏళ్లు. కిరణ్ మార్చి 25 తన ఆఫీసులో ఉండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకుండా పోయింది.  సంచారి , పయన, పారు w/o దేవదాస్ వంటి చిత్రాలకు ఆయన  దర్శకత్వం వహించారు. తెలుగులో ఈయన తిరుగుబొతు అనే చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు.  కిరణ్ గోవి మృతి పట్ల  శాండల్‌వుడ్‌లోని పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.  

కిరణ్ గోవి పుట్టింది తుమకూరులో.. చదువుకున్నది బెంగళూరులో. అతని తండ్రి టెలిఫోన్ ఫ్యాక్టరీలో పనిచేయడమే కాకుండా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత నటుడిగా మారాలనే కోరికతో  కిరణ్ కొన్ని వాణిజ్య ప్రకటనలలో అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ తరువాత  KSDL చంద్రు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు . పురాణిక్, అక్రమ్, రవికిరణ్ సీరియల్స్‌కి సునీల్ అసిస్టెంట్‌గా పనిచేశారు.