టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (PrasanthVarma), హీరో తేజ సజ్జ(Teja Sajja) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ హనుమాన్ (Hanuman). సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.
లేటెస్ట్గా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల మార్కును అందుకుంది. ఈ మేరకు కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం హనుమాన్ మూవీ అశేషమైన ప్రేక్షక ఆదరణతో పాటు కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో రాబడుతోంది. కేవలం ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లెక్కల్లో కూడా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.
जय श्री राम ?
— Primeshow Entertainment (@Primeshowtweets) January 22, 2024
With the divine blessings of Lord Shree Ram, #HanuManRAMpage continues to soar higher at the Box-office ❤️?
2️⃣0️⃣0️⃣ CRORE WORLDWIDE collections for #HANUMAN in just 10 Days ??
A @PrasanthVarma film
?ing @tejasajja123#HanuManEverywhere@Niran_Reddy… pic.twitter.com/PM4FjDhhJK
ఇదిలా ఉంటే ..హనుమాన్ మూవీకి సీక్వెల్గా రానున్న జై హనుమాన్ (Jai hanuman)ను ఉద్దేశించి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ లేటెస్ట్గా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హనుమాన్ సీక్వెల్లో హీరో తేజ సజ్జా కాదని తెలిపారు. ఈ మూవీ సక్సెస్లో భాగంగా ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్నివెల్లడించారు.
ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..హనుమాన్ మూవీ కంటే..జై హనుమాన్ మూవి వందరెట్లు ప్రేక్షకులు ఊహించని స్థాయిలో ఉండనుంది. వచ్చే సీక్వెల్లో హీరో తేజ సజ్జా కాదు..అతడు హనుమంతు క్యారెక్టర్ లోనే కనిపిస్తాడని..జై హనుమాన్ లో హీరో ఆంజనేయ స్వామి అని తెలిపారు.
హనుమాన్ సీక్వెల్లో ఆంజనేయ స్వామి పాత్రను స్టార్ హీరో చేస్తారని..2025లో భారీ స్థాయిలో సినిమా రిలీజ్ కానుందని..అంతకంటే ముందు మరో రెండు చిత్రాలు తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. అందులో ముందుగా ‘అధీర’, మరొకటి ‘మహాకాళి’ అని మీడియాతో ప్రశాంత్ వర్మ వెల్లడించారు.
ఇప్పటికే రాముడి పాత్రలో మెగాహీరో రామ్ చరణ్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..మరి ఆంజనేయుడిగా ఎవరు కనిపిస్తారనేది సస్పెన్స్ గా మారింది. ఇక సినీ లవర్స్ తమ అభిమాన నటుల్ని ఆంజనేయుడిగా ఊహించుకుంటూ పోస్టర్స్ డిజైన్ చేస్తున్నారు.