
దిశ నిందితలను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. హైదరాబాద్లో డాక్టర్ను చంపిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. నిందితులను కోర్టు పోలీస్ కస్టడీకి అప్పగించింది. కేసు దర్యాప్తులో భాగంగా.. సీన్ రీకనస్ట్రక్షన్ కోసం నిన్న నిందితులను చటాన్ పల్లిలోని ఘటన జరిగిన స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడి నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించడంతో.. చేసేది ఏంలేక పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ కేసులో A1ఆరిఫ్, A2జొల్లు శివ, A3జొల్లు నవీన్, A4చెన్నకేశవులు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. దిశను చంపిన స్థలంలోనే నిందితులను ఎన్కౌంటర్ చేయడం విశేషం.
For More News..
ఆ బుల్లెట్లు దాచుకోవాలని వుంది
నేను ఈ తరహా ఎన్కౌంటర్లకు వ్యతిరేకం: ఒవైసీ
స్త్రీని భోగవస్తువుగా చూడొద్దు.. మగవాడు కట్టుబాట్లు పాటించాలి
రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులో రెండు మృతదేహాలు