
ప్రపంచ వ్యాప్తంగా ఏ రంగంలో చూసినా, ఏ వ్యాపారంలో గమనించినా ప్రస్తుతం కొనసాగుతున్నదల్లా లేఆఫ్స్. అది కూడా పదులు వందల సంఖ్యలో కాదు ఏకంగా వేల సంఖ్యలో భారీగా ఉద్యోగులు కోతలకు కంపెనీ వెళుతున్నాయి.
ఇదే క్రమంలో బ్రిటన్ లోని అతిపెద్ద బ్రాడ్ బ్యాండ్ సంస్థ బిటి గ్రూప్ తన ఉద్యోగుల సంఖ్యను 55 వేల మేర తగ్గించాలని చూస్తోంది. కంపెనీ వీరి స్థానంలో ఏఐ టెక్నాలజీలను వినియోగించటం ద్వారా ఖర్చుల భారాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది. 2030 నాటికి దశల వారీగా ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ చెబుతోంది. ఈ చర్యల ద్వారా సంస్థ రూ.30వేల కోట్ల వరకు ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ సీఈవో అలైసన్ కిర్క్బి వెల్లడించారు.
ALSO READ | సైట్ ఇంజినీర్ జాబ్స్ కోసం చూస్తుంటే ఇటో లుక్కేయండి..
మారుతున్న ఏఐ యుగంలో తక్కువ మంది ఉద్యోగులతో సమర్థవంతంగా సేవలను కొనసాగించటానికి వీలుపడుతుందని కంపెనీ సీఈవో పేర్కొన్నారు. ఏఐతో రానున్న దశాబ్ధకాలంలో వ్యాపారంలో భారీగా మార్పులు రానున్నాయని చెప్పారు. ఇదే క్రమంలో కంపెనీ తన ఓపెన్ రీచ్ బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్ విభాగాన్ని టెలికాం వ్యాపారం నుంచి విడదీయాలని చూస్తోంది. కొత్తగా గత ఏడాది ఫిబ్రవరిలో సీఈవో మార్పు తర్వాత కంపెనీ ఇటలీ, ఐరిష్ ప్రాంతాల్లో తమ వ్యాపారాలను విక్రయించాలని నిర్ణయించింది. ఆమె తీసుకున్న నిర్ణయం విజయవంతం కావటంతో కంపెనీ షేర్ల విలువ కూడా ఏకంగా 65 శాతం పెరుగుదలను చూసింది.