స్టూడెంట్స్​కు సైకిళ్లు, బ్యాగుల పంపిణీ

స్టూడెంట్స్​కు సైకిళ్లు, బ్యాగుల పంపిణీ

కామారెడ్డి టౌన్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్​జిల్లాకు చెందిన 2009 బ్యాచ్​సివిల్​ఎస్ఐలు ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్టూడెంట్స్​కు సైకిళ్లు, బ్యాగులు, బుక్స్​పంపిణీ చేశారు.   దేవునిపల్లి, లింగాపూర్, కృష్ణాజీవాడి గవర్నమెంట్​స్కూల్స్​లో చదువుతున్న పేద విద్యార్థులకు వీటిని అందించారు. సమాజసేవలో తమ వంతు బాధ్యతగా పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసినట్లు చెప్పారు.