కేసీఆర్ వరంగల్ పర్యటన.. కరపత్రాల కలకలం 

కేసీఆర్ వరంగల్ పర్యటన.. కరపత్రాల కలకలం 

వరంగల్ అర్బన్: ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పలు కరపత్రాల పంపిణీ కలకలం సృష్టిస్తోంది. తూర్పు ఎమ్మెల్యే నరేందర్ కబ్జాకోరు అంటూ ఆ లేఖలో రాసుండటం గమనార్హం. ఈ కరపత్రాలను న్యూస్ పేపర్‌‌లో పెట్టి వరంగల్ తూర్పులో గుర్తు తెలియని వ్యక్తులు పంపిణీ చేశారని సమాచారం. రీసెంట్‌గా జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే నరేందర్ టీఆర్ఎస్ పార్టీ బీ ఫారంలను రూ.50 లక్షలకు అమ్మాడని సదరు కరపత్రాల్లో ఆగంతకులు ఆరోపించారు. గతంలో ములుగు జిల్లాలో ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల సమయంలోనూ ఇలాగే డబ్బులు వసూలు చేశాడని గుర్తు తెలియని వ్యక్తులు ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతోపాటు వరంగల్ తూర్పులో భూకబ్జాలు, అధికార పార్టీ నేతలపై వేధింపులు, సెటిల్‌‌మెంట్ చేశాడంటూ పత్రాల్లో రాసుంది. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఈ కరపత్రాల పంపిణీ హాట్‌ టాపిక్‌గా మారింది.