మునుగోడులో  సీపీఐ పోటీ చేస్తది: పల్లా వెంకట రెడ్డి

మునుగోడులో  సీపీఐ పోటీ చేస్తది: పల్లా వెంకట రెడ్డి

నల్గొండ అర్బన్​, వెలుగు :  మునుగోడు సీటును  పొత్తులో భాగంగా సీపీఐకి ఇవ్వాలని, లేదంటే  సొంతంగా పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆ పార్టీ జిల్లా కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన  కౌన్సిల్ సమావేశానికి జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట రెడ్డి చీఫ్‌ గెస్టుగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను వివరించారు.

అనంతరం కౌన్సిల్‌ సభ్యులు మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో బలమైన ఉద్యమ  చరిత్ర ఉన్న మునుగోడు స్థానాన్ని ప్రతిసారి కాంగ్రెస్‌కు ఇవ్వడం సరికాదన్నారు. 2018 ఎన్నికల్లోనూ పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు ఇచ్చారని, ఈసారైనా తమకు అవకాశం ఇవ్వాలని కోరారు.  లేదంటే సొంతంగా పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని తీర్మానం చేసి జాతీయ, రాష్ట్ర కమిటీలకు పంపించారు.

 జిల్లా కార్యవర్గ సభ్యురాలు గిరి రామ అధ్యక్షత నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి, జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం,  సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లోడంగి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు పబ్బు వీరాస్వామి, ఆర్ అంజచారి, బోల్గురి నర్సింహా, వెంకటేశ్వర్లు, నల్పరాజు రామలింగయ్య, గురుజా రామచంద్రo బొడ్డుపల్లి వెంకట్ రమణ  పాల్గొన్నారు.