న్యూఢిల్లీ: దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్కు రెండో క్వార్టర్ (ఈ ఏడాది సెప్టెంబర్తో ముగిసిన) లో రూ. 689 కోట్ల నికర లాభం వచ్చింది. ఇది గత సెప్టెంబరు క్వార్టర్తో పోలిస్తే 35 శాతం అధికం. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో లాభం రూ. 510 కోట్లు ఉండేది.
రెండవ క్వార్టర్లో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 2,715 కోట్లు. ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ. 2,338 కోట్లు ఉండేది. ఈ క్వార్టర్లో కంపెనీకి రూ. 63 కోట్లు ఫారెక్స్ లాభం వచ్చింది. హైదరాబాద్కు చెందిన దివీస్ లేబొరేటరీస్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రిడియెంట్స్, న్యూట్రాస్యూటికల్స్తయారు చేస్తుంది.
