దొడ్ల డెయిరీ చేతికి ఓసమ్ డెయిరీ..డీల్ విలువ రూ.271 కోట్లు

దొడ్ల డెయిరీ చేతికి ఓసమ్ డెయిరీ..డీల్ విలువ రూ.271 కోట్లు

కోల్‌‌‌‌కతా: తూర్పు రాష్ట్రాలలో ప్రీమియం డెయిరీ బ్రాండ్  అయిన ఓసమ్​ డెయిరీలోని 100 శాతం వాటాను  రూ.271 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు దొడ్ల డెయిరీ లిమిటెడ్ శుక్రవారం ప్రకటించింది.  తూర్పు మార్కెట్లలోకి వెళ్లడానికే దీనిని కొన్నామని తెలిపింది. 

 కొనుగోలుతో పాన్ -ఇండియా డెయిరీ కంపెనీగా ఎదుగుతామని దొడ్ల డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ రెడ్డి అన్నారు. 2012లో ఏర్పాటైన ఓసమ్​ డెయిరీకి బీహార్, జార్ఖండ్,  ఇతర తూర్పు రాష్ట్రాలలో వెయ్యి పాల సేకరణ కేంద్రాలు ఉన్నాయి. 

ఇది రెండు ప్లాంట్లలో రోజుకు దాదాపు 1.1 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేస్తుంది. ఇన్‌‌‌‌క్రెడ్ క్యాపిటల్ ఓసమ్​‌‌‌‌కు ఆర్థిక సలహాదారుగా వ్యవహరించింది.  దొడ్ల డెయిరీని 1995లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌‌‌‌లో ఉంది. ఈ సంస్థ మొదటగా కొన్ని రాష్ట్రాల్లోనే తన కార్యకలాపాలను ప్రారంభించినా, ఇప్పుడు 11 రాష్ట్రాలలో తన ఉత్పత్తులను అమ్ముతోంది.