
- రాహుల్ గాంధీకి శివసేన లీడర్ శ్రీకాంత్ షిండే ప్రశ్న
- కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ను చూసి నేర్చుకోవాలని హితవు
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ విషయంలో ప్రధాని మోదీపై ‘సరెండర్’ కామెంట్లు చేసిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై శివసేన నేత శ్రీకాంత్ షిండే మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉపయోగిస్తోందన్న విషయం రాహుల్కు తెలుసా? అని ప్రశ్నించారు.
టెర్రరిజంపై ఐక్యంగా ఎలా పోరాడాలో కాంగ్రెస్ నాయకులు శశి థరూర్, సల్మాన్ ఖుర్షీద్ నుంచి రాహుల్ నేర్చుకోవాలని సూచించారు. వెస్ట్ ఆసియా, వెస్ట్ ఆఫ్రికాలోని నాలుగు దేశాలకు షిండే నేతృత్వంలోని ఓ బృందం పహల్గాం దాడి, పాక్ టెర్రరిజంపై వివరించేందుకు వెళ్లింది.
‘‘పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీ అమెరికా ముందు లొంగిపోయారని చెప్పడం రాహుల్ గాంధీకి మంచిది కాదు. పాకిస్తాన్ రాహుల్ వ్యాఖ్యలను ఇండియాకు వ్యతిరేకంగా ఉపయోగిస్తోందన్న విషయం గ్రహించాలి. రాహుల్ మాటలు దేశానికి వ్యతిరేకమా? అనుకూలమా? అన్నది ప్రజలు గమనిస్తున్నారు” అని అన్నారు.