
న్యూఢిల్లీ : స్టేషనరీ ప్రొడక్ట్లు తయారు చేసే డొమ్స్ ఇండస్ట్రీస్ ఐపీఓ చివరి రోజు నాటికి 93.52 రెట్లు సబ్స్క్రిప్షన్ సాధించింది. ఏకంగా 34.28 కోట్ల షేర్లు కొనేందుకు బిడ్స్ వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 115.97 రెట్లు, రిటైల్ పోర్షన్ 69.67 రెట్లు, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 66.51 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యాయి.
ఉద్యోగుల కోసం కేటాయించిన షేర్లు 29.21 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యాయి. డొమ్స్ షేరు రూ.750–790 దగ్గర అందుబాటులోకి వచ్చింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,200 కోట్లు డొమ్స్ సేకరించింది. గ్రే మార్కెట్లో కంపెనీ షేర్లు రూ.528 ప్రీమియంతో ట్రేడవుతున్నాయి.