మనుషుల్లో అత్యంత నిజాయితీపరుడిని నేనే   

మనుషుల్లో అత్యంత నిజాయితీపరుడిని నేనే   

వాషింగ్టన్: ఒక వ్యక్తి మంచివాడు, నిజాయితీపరుడు అని అతడి చుట్టు పక్కల ఉండేటోళ్లు చెప్పాలె.. కానీ తన కు తానే మంచోడినని చెప్పుకుంటే ఏమనాలి? అమెరికా మాజీ ప్రెసిడెంట్​ డొనాల్డ్​  ట్రంప్​ అనాలె. నాలుగేండ్ల పాల నలో ఇష్టమొచ్చిన నిర్ణయాలు తీసుకొని, ఓడిపోయినంక కూడా గద్దె దిగడానికి మొండికేసిన ట్రంప్.. ఇలా సెల్ఫ్ సర్టిఫికే ట్ ఇచ్చుకున్నాడు. ఈ భూమ్మీద ఇప్పటి వరకు దేవుడు సృష్టించిన మనుషుల్లో అత్యంత నిజాయితీపరుడు తానేనని చెప్పుకున్నడు. నార్త్ కరోలినాలోని సెల్మా లో జరిగిన ర్యాలీలో ట్రంప్ మాట్లాడు తూ.. 'ఏళ్లకు ఏళ్లు ఇన్వెస్టిగేషన్ చేసి, లక్షల పేజీల డాక్యుమెంట్లు వెతికినా వాళ్లకు ఏమీ దొరకదు. ఎందుకంటే భూమిపైన ఉన్నోళ్లలో నువ్వు చాలా స్వచ్ఛమైన వ్యక్తివి' అని తన స్నేహితుడు చెప్పాడన్నాడు. యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ పై కిందటేడాది జరిగిన దాడిలో ట్రంప్ హస్తం ఉన్నట్లు విచారణ అధికారులు తేల్చారు.