మా ఇంటికి రాకండి.. ఓటు అడిగే హక్కు మీకు లేదు

మా ఇంటికి రాకండి..  ఓటు అడిగే హక్కు మీకు లేదు

యాదాద్రి, వెలుగు : సమస్యలను పరిష్కరించని రాజకీయ నాయకులకు ఓటు అడిగే హక్కు లేదని యాదాద్రి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూరులో  ఓ కుటుంబంలోని ఓటర్లు తేల్చిచెప్పారు. ఓట్లు అడగడానికి తమ ఇంటికి ఎవరూ రావద్దని సూచించారు. ఈ మేరకు తమ ఇంటి గేటుపై ఓ బ్యానర్​ ఏర్పాటు చేశారు. మోత్కూరులోని బాలుర గురుకుల పాఠశాల నుంచి మెయిన్​రోడ్డు వరకూ మురికి కాలువ లేదని తెలిపారు. 

దుర్వాసనతో పాటు దోమలతో అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. సమస్య గురించి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోలేదని ఫైర్  అయ్యారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినందున తమ సమస్యను ఎత్తి చూపుతూ ఆ కుటుంబ సభ్యులు ​‘‘మా సమస్యలు నాయకులకు పట్టవు. ఓట్ల కోసం మా ఇంటికి రాకండి’’ అని బ్యానర్​ ఏర్పాటు చేశారు.