ఓటు వేసేందుకు డబ్బు తీసుకోవద్దు : రాంగోపాల్ వర్మ

ఓటు వేసేందుకు డబ్బు తీసుకోవద్దు :  రాంగోపాల్ వర్మ

ఖైరతాబాద్, వెలుగు :  కార్టూన్​అనేది స్పీచ్ కంటే షార్ప్​గా ఉంటుందని సినీ డైరెక్టర్ రాంగోపాల్​వర్మ అన్నారు. ఓటు కోసం డబ్బులు తీసుకోవడం నేరమేనని.. అయితే ఇచ్చిన వాడు కూడా నేరం చేస్తున్నట్లేనని పేర్కొన్నారు.  కార్టూన్ల ద్వారా ఓటర్లను చైతన్య పరిచేందుకు కార్టూనిస్టులంతా వివిధ రూపాల్లో కార్టూన్లు వేసి సోమాజిగూడ ప్రెస్​క్లబ్​ఆవరణలో మంగళవారం ప్రదర్శించారు. 

 ‘ఆర్ట్​ఫర్​డెమోక్రసీ ఎగైనిస్ట్​ఓట్​బ్రైబరీ’ పేరుతో నిర్వహించిన ప్రదర్శనను రాంగోపాల్​వర్మ చూశారు. ఎంవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..  డబ్బున్నవారు ఓటు వేసేందుకు డబ్బుతీసుకోవద్దు..అయితే డబ్బులేనోళ్లైతే ఆ డబ్బు తీసుకొని వాళ్లకు అనుకూలమైన వారికి ఓటు వేసుకోవాలన్నారు. 

కార్యక్రమంలో ప్రెస్​క్లబ్​అధ్యక్షుడు వేణుగోపాల్​నాయుడు, ప్రధాన కార్యదర్శి రవికాంత్​రెడ్డి,  దేవులపల్లి అమర్​ తదితరులు పాల్గొన్నారు.