రెండేళ్లయిన ఇండ్లు పంచరా? : ఎమ్మెల్యే రఘునందన్​రావు

రెండేళ్లయిన ఇండ్లు పంచరా? : ఎమ్మెల్యే రఘునందన్​రావు
  • ఆగస్టు 20లోగా పంపిణీ చేయకుంటే మేమే పంచుతాం

దుబ్బాక, వెలుగు: రెండేండ్ల  కింద పూర్తయిన డబుల్​బెడ్​ రూమ్​లు బొమ్మలుగా మారాయని ఎమ్మెల్యే రఘునందన్​రావు అసహనం వ్యక్తం చేశారు. దుబ్బాక పట్టణంలో కార్మికుల కోసం నిర్మించిన 84 డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డబుల్​ బెడ్​రూమ్​ల్లో కనీస సౌకర్యాలు కల్పించి వెంటనే పేదలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15లోగా డ్రాలు తీసి  20లోగా లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వకపోతే, తామే ఆ ఇండ్లను పంచుతామని స్పష్టం చేశారు. 

అనంతరం దుబ్బాక పట్టణానికి చెందిన మల్లుగారి అనిల్​ రెడ్డి గాయపడిన విషయం తెలుసుకుని పరామర్శించారు. అక్బర్​పేట-–భూంపల్లి మండలం బొప్పాపూర్​గ్రామానికి చెందిన కారంగుల మోహన్​రావు మరణించడంతో అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ నాయకులు అంబటి బాలేశ్​గౌడ్, దూలం వెంకట్, మచ్చ శ్రీనివాస్, సుంకోజి ప్రవీణ్​, నేహాల్​గౌడ్, గోపరి యాదగిరి, రమేశ్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.