విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు : సౌభాగ్య లక్ష్మి

విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు : సౌభాగ్య లక్ష్మి

మక్తల్, వెలుగు : విధుల్లో  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్ వో డాక్టర్ సౌభాగ్య లక్ష్మి హెచ్చరించారు. పట్టణంలోని కమ్యూనిటీ ఆస్పత్రిని శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో గర్భిణులకు అందుతున్న సేవలను పరిశీలించారు. 

గర్భిణీ స్త్రీలు మూడో, నాలుగో చెకప్ కోసం మక్తల్, మాగనూరు, ఊట్కూర్, నర్వ మండల ప్రజలకు సీహెచ్ సీ లో సదుపాయాలు కల్పించామని . ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పార్వతి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.