హైదరాబాద్, వెలుగు : కృష్ణ వాటర్ సప్లై ఫేజ్–1 కు మీరాలం, అలియాబాద్ ఆఫ్ టేక్ ప్రాంతం వద్ద మెయిన్ పైపులైన్ కు జంక్షన్ పనులు కారణంగా తాగునీరు బంద్ పెడుతున్నట్టు వాటర్ బోర్డు తెలిపింది. చాంద్రాయణగుట్ట సన్నీ గార్డెన్ నుంచి షోయబ్ హోటల్ వరకు బాక్స్ డ్రెయిన్ పనులకు ఇబ్బందులు కలగకుండా జంక్షన్ పనులు చేపడతారు. దీంతో శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు రిజర్వాయర్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
మిస్త్రీగంజ్, బహదూర్ పురా, కిషన్ బాగ్, జహానుమా, మొఘల్ పురా, దారుల్ షిఫా, సుల్తాన్ షాహి, పత్తర్ ఘట్టి, అల్ జుబైల్ కాలనీ, అలియాబాద్, గౌలిపురా, తలాబ్ కట్ట, రియాసత్ నగర్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుంది, ఆయా ప్రాంతాల ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.