సూరారంలో డ్రగ్స్ స్వాధీనం..పట్టుబడిన వారిలో డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు?

సూరారంలో డ్రగ్స్ స్వాధీనం..పట్టుబడిన వారిలో డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు?

జీడిమెట్ల, వెలుగు: సూరారం పోలీస్​ స్టేషన్​ పరిధిలో డ్రగ్స్​ ముఠా గుట్టును మేడ్చల్​ ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. శ్రీరామ్​నగర్​లోని ఓ ఇంట్లో న్యూఇయర్​ వేడుకల కోసం డ్రగ్స్​ విక్రయిస్తున్నారన్న సమాచారంతో మేడ్చల్​ ఎస్వోటీ పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. రూ.4 లక్షల విలువైన 70 గ్రాముల ఎండీఎం డ్రగ్​తో పాటు 2 కార్లు, 8 సెల్​ఫోన్స్​ సీజ్​చేశారు. పట్టుబడిన వారిలో డాక్టర్లు, సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లు ఉన్నట్లు సమాచారం.