న్యూ ఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ ముఠా భారీ స్కెచ్

న్యూ ఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ ముఠా భారీ స్కెచ్
  • అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను పట్టుకున్న రాచకొండ పోలీసులు

హైదరాబాద్ : డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా నిందితులు కొత్త దారుల్లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం భారీ స్కెచ్ వేసిన ముఠాను మల్కాజ్ గిరి SOT పోలీసులు అరెస్ట్ చేశారు.

అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించగా.. వారి వద్ద నుంచి భారీ ఎత్తున మత్తు పదార్థాలు దొరికాయి. పట్టుపడిన మత్తు పదార్థాల విలువ దాదాపు 9 కోట్ల వరకూ ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విదేశాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు నిందితులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసును అన్ని కోణల్లో దర్యాప్తు చేస్తున్నారు.