- యాక్షన్ తీసుకోవాలంటూ స్టూడెంట్ల ధర్నా
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల డీటీడీవో జనార్ధన్మద్యం మత్తులో క్లాస్ రూంలోకి రావడమే కాకుండా బూతులు తిడుతూ కొట్టాడని సాయికుంటలోని ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్లు ఆరోపించారు. తమపట్ల దురుసుగా ప్రవర్తించిన డిస్ట్రిక్ట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్(డీటీడీవో)పై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్కూల్ఆవరణలో ధర్నా చేశారు. ఈ నెల 11న సాయంత్రం 6.30 గంటల సమయంలో డీటీడీవో జనార్ధన్ టెన్త్ మ్యాథ్స్ క్లాస్రూంలోకి వచ్చారని, మద్యం మత్తులో ఉన్న ఆయన తలుపులు, కిటికీలు మూసి తమను అసభ్య పదజాలంతో తిట్టడమే కాకుండా కొట్టాడని స్టూడెంట్లు చెప్పారు. విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడన్నారు. రాత్రి 8 గంటలవుతుండడంతో భోజనం చేస్తామని అడిగితే ఒక్కపూట తినకుంటే చస్తారా అంటూ భయభ్రాంతులకు గురిచేశాడని ఆరోపించారు. ఉన్నతాధికారి అనే విషయాన్ని మర్చిపోయి స్టూడెంట్లతో అసభ్యంగా, పోకిరిలాగా ప్రవర్తించిన డీటీడీవోను సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్రంజిత్ డిమాండ్ చేశారు. టౌన్ సీఐ నారాయణ నాయక్ ఫోన్లో ఐటీడీఏ పీవో దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఎంక్వైరీ చేసి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇవ్వడంతో స్టూడెంట్లు ధర్నా విరమించారు. స్టూడెంట్ల ఫిర్యాదు మేరకు డీటీడీవోపై కేసు ఫైల్చేసినట్టు సీఐ చెప్పారు.