ప్రజలు మోసపోయి గోసపడొద్దు : రఘునందన్ రావు

ప్రజలు మోసపోయి గోసపడొద్దు : రఘునందన్ రావు

తొగుట, వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మోసపోయి గోసపడొద్దని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మంగళవారం మండలంలోని ఎల్లారెడ్డి పేట్, పెద్దమసన్ పల్లి, బండారు పల్లి  గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీగా పదేండ్లు గడుస్తున్నా దుబ్బాక నియోజక వర్గ ప్రజలకు కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు.

సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో మాత్రమే అభివృద్ధి జరిగింది గానీ దుబ్బాకను పట్టించుకోలేదన్నారు. ప్రశ్నించే గొంతును మరోసారి గెలిపించాలని ఓటర్లను కోరారు.  అనంతరం ఎల్లారెడ్డిపేట గ్రామ వార్డు సభ్యులు బీజేపీలో చేరగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో చంద్రం, స్వామి రెడ్డి, నర్సింలు, ప్రవీణ్, విభీషణ్​ రెడ్డి, కల్యాణ్ దాస్, లింగం, బాల్ రెడ్డి పాల్గొన్నారు