నామినేషన్ల సందర్భంగా అచ్చంపేటలో ఉద్రిక్తత

నామినేషన్ల సందర్భంగా అచ్చంపేటలో ఉద్రిక్తత

అచ్చంపేట, వెలుగు : నామినేషన్ల సందర్భంగా నాగర్​ కర్నూల్ ​జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజ్, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వంశీకృష్ణ  నామినేషన్ వేసేందుకు  బుధవారం అచ్చంపేట ఆర్డీవో ఆఫీసుకు వచ్చారు. ఈ సందర్భంగా బయట ఉన్న ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిని ఒకరు కేకలు వేసుకుంటూ, ఒకరిపై ఒకరు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు.

పోటా పోటీగా నినాదాలు చేసుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్​అభ్యర్థి బాలరాజు వెంట నలుగురు వ్యక్తులతో పాటు గన్ మెన్లు కూడా లోపలికి వెళ్తుండగా కాంగ్రెస్​లీడర్లు అభ్యంతరం తెలిపారు. ఈ విషయమై వారు ఎస్​ఐ గోవర్ధన్​తో వాగ్వాదానికి దిగారు. దీంతో డీఎస్పీ కృష్ణకిషోర్, సీఐ అనుదీప్ వచ్చి కాంగ్రెస్ నేతలకు సర్దిచెప్పారు. గన్​మెన్లను బయటకు పంపించడంతో వారు శాంతించారు.