గ్రీన్,ఆరెంజ్ జోన్లలో ఈ-కామర్స్ అన్ని అమ్మకాలకు అనుమతి

గ్రీన్,ఆరెంజ్ జోన్లలో ఈ-కామర్స్ అన్ని అమ్మకాలకు అనుమతి

దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు నిలువరించేందుకు కేంద్రం లాక్ డౌన్ ను మే 17 వరకు పొడిగించింది. కేంద్రం ప్రకటించిన రెండో విడత లాక్ డౌన్ మే 3న ముగియనుంది. ఈ క్రమంలోనే కేంద్రం మే 4 నుంచి  17 లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ లాక్ డౌన్ లో గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో కొన్ని సడలింపులు ప్రకటించింది.

దీనికి సంబంధించి సవరించిన మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో ఈ-కామర్స్ సంస్థలు అన్ని రకాల వస్తువులు అమ్ముకోవచ్చని తెలిపింది. దేశంలో కరోనా వ్యాప్తి ప్రారంభమైన తర్వాత అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ పోర్టళ్ల ద్వారా కేవలం నిత్యావసరాలనే అనుమతించారు. తమకు అన్ని రకాల వస్తువులను సేల్ చేసుకునే అవకాశం కల్పించాలని పలు ఈ-కామర్స్ సైట్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. ఈ క్రమంలోనే  లేటెస్టుగా నిర్ణయం తీసుకుంది. అంతేకాదు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో బార్బర్ షాపులకు కూడా కేంద్రం అనుమతి ఇచ్చింది.