నన్ను గెలిపించండి.. ప్రతి హైస్కూల్​కు రూ.2.50 లక్షలు కేటాయిస్తా

నన్ను గెలిపించండి.. ప్రతి హైస్కూల్​కు రూ.2.50 లక్షలు కేటాయిస్తా
  • బీజేపీ గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి

గోదావరిఖని, వెలుగు: తనను గెలిపిస్తే ప్రతి మండలంలోని ఓ హైస్కూల్‌‌ను ఎంపిక చేసుకుని దాని అభివృద్ధికి తన శాలరీ నుంచి రూ.2.50 లక్షలు కేటాయిస్తానని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం సాయంత్రం బీజేపీ లీగల్​సెల్​ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బార్​అసోసియేషన్​ఆఫీస్‌‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

 ప్రతి అడ్వకేట్‌‌కు నోటరీగా అవకాశం కల్పించేలా ప్రయత్నం చేస్తానన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ లీగల్​సెల్​స్టేట్​ఎగ్జిక్యూటివ్​ మెంబర్​ బల్మూరి అమరేందర్‌‌‌‌రావు, లీడర్లు చంద్రశేఖర్​, సంజయ్​ కుమార్, సోమారపు లావణ్య, బల్మూరి వనిత, కందుల సంధ్యారాణి,  సోమారపు అరుణ్​కుమార్​, తదితరులు పాల్గొన్నారు. కాగా సాంకేతిక సమస్యతో ఎమ్మెల్సీ బరి నుంచి తప్పుకున్న తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ పోకల నాగయ్య బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు.