ప్రశాంతంగా ఎంసెట్ అగ్రికల్చర్ ఎగ్జామ్

ప్రశాంతంగా ఎంసెట్ అగ్రికల్చర్ ఎగ్జామ్

ఈ నెల రెండో వారంలో రిజల్ట్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండ్రోజుల పాటు జరిగిన ఎంసెట్ అగ్రికల్చర్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 94,476 మంది అప్లై చేయగా, 80,575(85%) మంది హాజరయ్యారని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. శనివారం 84.5% మంది హాజరుకాగా, ఆదివారం 86.1% మంది పరీక్ష రాశారని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష పూర్తయింది. ఈ నెల రెండో వారంలో ఫలితాలు రిలీజ్​ చేసే అవకాశం ఉంది. 

ఇవ్వాల ఈసెట్ 

రాష్ట్రంలోని బీటెక్, బీఫార్మసీ తదితర కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ కోసం నిర్వహించే టీఎస్​ఈసెట్ ఎగ్జామ్ ​సోమవారం జరగనున్నది.  పరీక్షకు మొత్తం 24,055 మంది హాజరవుతారని భావిస్తున్నట్లు ఈసెట్ కన్వీనర్ విజయ్ కుమార్ తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష ఉంటుందని చెప్పారు. కొత్త హాల్ టికెట్లను వెబ్​సైట్​ నుంచి డౌన్​లోడ్ చేసుకోవాలని సూచించారు.