కార్గిల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదు

కార్గిల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదు

లద్దాఖ్లో భూకంపం వచ్చింది. కార్గిల్కు 246 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సాయంత్రం 6.50గంటల సమయంలో భూమి కంపించినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అన్నారు.