
- రాష్ట్రంలో 1309 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న ఈసీ
- నియోజకవర్గానికి ఐదు చొప్పున మహిళల కోసమే ప్రత్యేకం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో ఈసీ వినూత్న పద్ధతులకు శ్రీకారం చుడుతోంది. విస్తృతంగా టెక్నాలజీని వాడుకోవడంతో పాటు పోలింగ్ స్టేషన్లనూ ఆకట్టుకునేలా ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా1200 పోలింగ్ కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు వాటిని ప్రత్యేక స్టేషన్లుగా గుర్తించనున్నారు. గతంలో మహిళల కోసం పింక్ పోలింగ్కేంద్రాలను ఈసీ మొదలు పెట్టింది.
అప్పుడు చాలా తక్కువ సంఖ్యలో నియోజకవర్గానికి ఒకటి మాత్రమే పరిమితం చేయగా ఈసారి ఆ సంఖ్యను 5కు పెంచింది. ఇలా ప్రతి నియోజకవర్గంలో మహిళల కోసం 5 మహిళా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 595 స్పెషల్ఉమెన్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రెడీ చేశారు. ఇందులో కేవలం మహిళా ఓటర్లను మాత్రమే అనుమతిస్తారు. మహిళా అధికారులు విధులు నిర్వహిస్తారు. ఇప్పటికే డ్రాప్ట్ ఓటర్ల జాబితా ప్రకారం పురుషులు, మహిళల ఓటర్ల జాబితాను ఎనలైజ్చేసి.. ఎక్కడ మహిళ ఓటర్లు ఎక్కువగా ఉంటారో ఆ ప్రాంతాల్లో ఉమెన్పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.
ఐదు చొప్పున మోడల్ పోలింగ్ స్టేషన్లు
పోలింగ్ శాతం పెంచేందుకు.. మోడల్పోలింగ్స్టేషన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. వీటిని కూడా ప్రతి నియోజకవర్గానికి ఐదు చొప్పున 595 మోడల్పోలింగ్స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ఎంపిక ప్రక్రియను ఎన్నికల అధికారులు మొదలుపెట్టారు. ఇతర పోలింగ్స్టేషన్లకు భిన్నంగా వీటిని తీర్చిదిద్దనున్నారు. సాధారణంగా గ్రామాల్లో 1200 మంది ఓటర్లకు ఒక పోలింగ్కేంద్రం, పట్టణ ప్రాంతాల్లో 1400 మంది ఓటర్లకు ఒక పోలింగ్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన ఓటర్ల కోసం కూడా నియోజకవర్గానికి ఒకటి చొప్పున పీడబ్ల్యూడీ పోలింగ్ స్టేషన్ఏర్పాటు చేసే ప్లాన్చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితాకు అనుగుణంగా 34,891 పోలింగ్స్టేషన్లు ఉన్నాయి. ఈ సంఖ్య 35 వేలకు చేరనుంది.
ఈసీ పర్యటనకు అన్ని రెడీ చేస్తున్నాం : వికాస్రాజ్
కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడు షెడ్యూల్ విడుదల చేసినా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఈఓ వికాస్రాజ్తెలిపారు. అక్టోబర్ 3 నుంచి మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ పర్యటన ఉందని దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మొదటి రోజు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం ఉంటుందన్నారు. మరణించిన వారితో పాటు బోగస్ ఓట్లు కలిపి 8 లక్షల ఓట్లు తొలగించినట్లు చెప్పారు.