- పర్యావరణ హితం కొత్త మున్సిపల్ చట్టం
ఇల్లు, షాపుల ముందు మొక్కలు నాటి, పచ్చదనం పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టంలో నిబంధన తేనుంది. గ్రీనరీ, ఎకో ఫ్రెండ్లీ అంశాలకు ప్రాధాన్యమిస్తూ మున్సిపల్ యాక్ట్-2019 ను రూపొందిస్తోంది. హరితహారంలో పెద్దఎత్తున మొక్కలు నాటుతున్నా…మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆశించిన గ్రీనరీ డెవలప్ మెంట్ కావడం లేదు. పట్టణీకరణలో భాగంగా మల్టీ స్టోరీడ్ బిల్డిం గ్స్కు, శివారు ప్రాంతాల్లో రియల్ వెంచర్లకు భారీగా చెట్లు, జలవనరులు వాడుతున్న ఉదంతాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిబంధన తెస్తోంది. మున్సిపాలిటీల్లో లే అవుట్లు, బిల్డింగ్ ల నిర్మాణానికి అనుమతులిచ్చే టైంలోనే మొక్కలు నాటాలన్న ఆంక్షలు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నిబంధనలున్నప్పటికీ పర్మిషన్ల సమయంలో కొంతమంది అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు.
ఫైర్ సేఫ్టీ మాదిరిగానే…
షాపు యజమానే సామాజిక బాధ్యతగా మొక్కల పెంపకం చేపట్టాలని మున్సిపల్ చట్టంలో నిబంధన పెట్టనున్నారు. చిన్నపాటి షాపులకు పర్మిష న్ , రెన్యూ వల్స్ టైంలో కూడా గ్రీనరీ నిబంధనలకు లోబడి మున్సిపల్ యంత్రాంగం కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఫైర్ సేఫ్టీ మాదిరిగానే తప్పకుండా మొక్కలు పెంచాలని చట్టంలో పొందుపరుస్తున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలోని హై రైజ్ బిల్డింగ్ పర్మిషన్లకు ఈ నిబంధనలు కచ్చి తంగా అమలయ్యేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.