ఆస్ట్రేలియా-ఇండియా మధ్య ఆర్థిక సహకారం, వ్యాపార ఒప్పందం జరిగింది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, ప్రధాని మోడీ మధ్య జరిగిన వర్చువల్ సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఆస్ట్రేలియా వాణిజ్య మంత్ర డేన్ టెహాన్ ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. తక్కువ సమయంలోనే ఈ ఒప్పందం ఖరారు కావడం.. ఇరుదేశాల మధ్య ఉన్న పరస్పర, లోతైన అవగాహన, నమ్మకానికి అద్ధం పడుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ ఒప్పందాన్ని ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రత్యేకమైనదిగా అభివర్ణించారు.
ఇవి కూడా చదవండి
ఛండీఘఢ్ను పంజాబ్కు ఎలా బదిలీ చేస్తారు?
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు రిఫరీగా తెలుగు మహిళ
వీడియో: బిజీ రోడ్డులో కారుపై ఎక్కి డాన్సులు
సామాన్యులకో రూల్.. అధికారుల బంధువులకో రూల్
ఆర్యన్ ఖాన్ కేసులో కీలక సాక్షి మృతి