కవిత భర్త అనిల్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం (మార్చి 18) విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించింది. పలు మార్లు విచారించిన అనంతరం శుక్రవారం ( మార్చి15)న హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఇప్పుడు తాజాగా కవిత భర్త అనిల్ ను విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటు కవిత వ్యక్తిగత సిబ్బంది ముగ్గురిని కూడా విచారించనున్నారు.. ఇప్పటికే నాలుగు ఫోన్లు సీజ్ చేశారు ఈడీ అధికారులు