గురుకుల టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్సీ శ్రీపాల్‌‌రెడ్డి

గురుకుల టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్సీ శ్రీపాల్‌‌రెడ్డి

నెక్కొండ/రాయపర్తి, వెలుగు: గురుకుల టీచర్ల సమ్యలను పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌‌రెడ్డి అన్నారు. వరంగల్​జిల్లా నెక్కొండ పట్టణంలోని టీఎస్​రెసిడెన్సియల్​ స్కూల్‌‌లో పీఆర్టీయూ సభ్యత్వ నమోదు ప్రోగ్రాంను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెసిడెన్సియల్​స్కూల్‌‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. టీచర్ల సమస్యల సాధనలో పీఆర్టీయూ ముందుంటుందన్నారు. అంతకుముందు రాయపర్తిలోని సోషల్‌‌ వెల్ఫేర్‌‌‌‌ స్కూల్‌‌లోనూ మెంబర్‌‌‌‌షిప్‌‌ కార్యక్రమం నిర్వహించారు. 

ఆయన వెంట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్​రెడ్డి, మహేందర్​రెడ్డి  మండల అధ్యక్ష, కార్యదర్శులుచ ప్రతాప్​సింగ్​, ప్రవీన్​ తదితరులున్నారు.