ముస్లింలకు మోడీ రంజాన్ శుభాకాంక్షలు

ముస్లింలకు మోడీ రంజాన్ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: దేశంలోని ముస్లింలకు ప్రధాని మోడీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ వేళ కరోనా మహమ్మారి పై పోరాటాన్ని మరింత బలోపేతం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. 'అందరికీ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు చేకూరాలని ప్రార్థనలు చేద్దాం. మహమ్మారిని తరిమికొట్టేందుకు కలసికట్టుగా కృషి చేద్దాం. తద్వారా మానవ మనుగడ కోసం శ్రమిద్దాం' అని మోడీ ట్వీట్ చేశారు.