న్యూఢిల్లీ: దేశంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎనిమిది బ్యాంకులు 2026 ఆర్థిక సంవత్సరంలో 13,223 మందిని నియమించుకున్నాయి. దీంతో వీటి మొత్తం సిబ్బంది సంఖ్య 6.28 లక్షలు దాటింది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ 8,905 ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా మొదటి స్థానంలో నిలిచింది.
2025 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఉద్యోగుల సంఖ్య 6.15 లక్షలుగా ఉండేది. ఈ జాబితాలో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ), ఇండియన్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉన్నాయి.
