కొండగట్టులో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పూజలు

కొండగట్టులో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పూజలు

కొండగట్టు, వెలుగు: స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి సోమవారం కొండగట్టు అంజన్నను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో వారికి స్వాగతం పలికి, దర్శనానంతరం స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఆలయ ఆవరణలో ఎలక్షన్​కమిషనర్​పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో కలెక్టర్ యాస్మిన్ భాష, అడిషనల్​కలెక్టర్ లత, ఏఈవో శ్రీనివాస్ పాల్గొన్నారు. 

ఎలక్షన్ కమిషనర్‌‌‌‌ను కలిసిన కలెక్టర్,​ సీపీ 

కరీంనగర్ టౌన్: కరీంనగర్ గెస్ట్ హౌజ్ లో సోమవారం స్టేట్​ఎలక్షన్ కమిషనర్ పార్థసారథిని కలెక్టర్ బి.గోపి, సీపీ సుబ్బారాయుడు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు.