
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇవాళ మరోసారి సోనియా గాంధీతో భేటీ కానున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహాలపై సోనియాకు మరోసారి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 600 స్లైడ్స్ తో కూడిన ప్రజెంటేషన్ పీకే టీం తయారు చేసింది. ఏ రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి వెళ్లాలనేదానిపై స్పష్టమైన సూచనలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో తెలంగాణలో ఒంటరిపోరుకే సిద్ధపడాలని ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధినేత్రికి సూచించినట్లు తెలుస్తోంది. ఏపీలో వైఎస్సార్సీపీతో పొత్తు పెట్టుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా 370 స్థానాల్లో కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగాలని.. మిగతా స్థానాల్లో మిత్రపక్షాలతో కలిసి పోటీ చేయాలని గత భేటీలో పీకే సూచించారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన కాంగ్రెస్ కమిటీ.. సోనియా గాంధీకి నివేదిక ఇచ్చింది. అయితే ఈ రోజు మరోసారి భేటీ కానున్న పీకే.. మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో ఎప్పుడు చేరుతారనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని వార్తల కోసం
రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు