ఏనుగులు సాధారణంగా భయపడవు. అవి గుంపులుగా వచ్చాయంటే అందరూ హడలి పోవాల్సిందే. అయితే తల్లి ఏనుగులు కొన్ని సమయాల్లో తీవ్ర భయాందోళనలకు గురవుతాయని ఇటీవల రిలీజ్చేసిన ఓ స్టడీలో వెల్లడైంది. గుంపులో గున్న ఏనుగులు ఎక్కువగా ఉన్నప్పుడు తల్లులు ఒత్తిడికి గురవుతాయని ఇందులో తేలింది. కానీ యుక్త వయసులో ఉండే ఆడ ఏనుగుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఒత్తిడి తగ్గుతుందని పేర్కొంది. మగ పిల్ల ఏనుగుల సంఖ్య, యుక్త వయసులోని ఆడ ఏనుగుల సంఖ్య, సీజన్లు, అవి పిల్ల తల్లులుగా ఉండే సమయం.. ఈ నాలుగూ తల్లి ఏనుగుల సైకలాజికల్ స్ట్రెస్పై ప్రభావం చూపుతాయని ఈ స్టడీ చెప్పింది. బెంగళూర్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ఆఫ్సైన్స్(ఐఐఎస్) సైంటిస్టులు ఏసియన్ఆడ ఏనుగులపై ఈ పరిశోధన చేశారు.
‘‘గుంపులో గున్నలు ఎక్కువగా ఉంటే వేటాడే జంతువుల నుంచి ముప్పు ఉంటుంది. ఆ సమయంలో తల్లి ఏనుగులు మరింత జాగ్రత్తగా ఉంటాయి. అదే యంగ్లేడీ ఎలిఫెంట్స్ఉంటే ధైర్యంగా ఉంటాయి. ఎందుకంటే అవి ముప్పును ఎదుర్కోగలవు”అని శాస్త్రవేత్తల్లో ఒకరైన సంజితా శర్మ చెప్పారు. శాస్త్రవేత్తలు ఆడ ఏనుగుల్లోని ఎఫ్జీసీఎం హార్మోన్ను సేకరించి ఈ స్టడీ చేశారు. దక్షిణ భారతదేశంలోని బందీపూర్, నాగర్హోల్జాతీయ పార్కుల్లోని123 ఏనుగుల నుంచి145 శాంపిళ్లను సేకరించారు. 2013–2015 మధ్య వీటిని తీసుకున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎఫ్జీసీఎం లెవల్స్ఎక్కువగా ఉంటాయని, అదే ఆగస్టు నుంచి డిసెంబర్వరకు తక్కువగా ఉంటాయని స్టడీలో తేలింది. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఎఫ్జీసీఎం లెవల్స్మిగతా వాటితో పోలిస్తే తల్లి ఏనుగుల్లోనే ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. ఏనుగుల సైకలాజికల్హెల్త్పై ప్రభావం చూపే అంశాలను అంచనా వేయడానికి ఈ స్టడీ ఉపయోగపడుతుందని సంజిత పేర్కొన్నారు.